07-02-2026 01:07:50 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 6(విజయక్రాంతి) : ఇండియన్ సొసైటీ ఫర్ స్టడీ ఆఫ్ పెయిన్ (ఇస్ప్కాన్ 2026) 40వ వార్షిక సదస్సు హైదరాబాద్లో ప్రారంభమైంది. సదస్సులో భారతదేశం నలుమూలలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నొప్పి నివారణ నిపుణు లు, క్లినీషియన్లు, పరిశోధకులు పాల్గొన్నారు. ఈ సదస్సును ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) జాతీయ తాజా మాజీ అధ్యక్షుడు డాక్టర్ దిలీప్ భానుశాలి ప్రారంభించారు.
అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూ ట్, సిటిజన్ ఆస్పత్రుల ప్రాంతీయ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ పాలచర్ల ప్రభాకర్ గౌరవ అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఐఎస్ఎస్పీ జాతీయాధ్యక్షుడు డాక్టర్ కృష్ణ పొద్దార్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమాన్ని సొసైటీ ఆఫ్ స్టడీ ఆఫ్ పెయిన్ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ చైర్పర్సన్ డాక్టర్ ఉమా మహేశ్వరరావు, ఆర్గనై జింగ్ సెక్రటరీ డాక్టర్ నాగలక్ష్మి పట్నాల వ్యవహరించారు.
పలు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో ప్రధానంగా వివిధ విభాగాల మధ్య సమన్వయం, నొప్పి నివారణలో ఇంటర్వెన్షనల్, ఫార్మకలాజికల్ ఆధునిక విధానాలు, దీర్ఘకాల నొప్పి నివారణకు బయో-సైకో-సోషల్ విధానం గురించి చర్చించారు. జాతీయ, అంతర్జాతీయ నిపుణులు కలిసి రోగుల పరిస్థితిని మెరుగుపరచడంలో స్థానిక అంశాల గురించి వివరించారు. తీవ్రమైన, దీర్ఘకాల నొప్పులతో బాధపడుతున్న రోగుల జీవన నాణ్యతను మెరుగుపరిచేందుకు విజ్ఞానం, ఆవిష్కరణలను మరింత బ లోపేతం చేసేందుకు ఇస్ప్కాన్ 2026 దృష్టిపెట్టిందని నిర్వాహకులు తెలిపారు.