1 July, 2026 | 7:44 PM

Breaking News

ఎర్రుపాలెం ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన ఎం.శారద   •   కంచర్లలో తాగునీటి సమస్యకు పరిష్కారం   •   శ్రీ ఉమామహేశ్వరంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రత్యేక పూజలు   •   విజయ క్రాంతి వార్తకు స్పందన మొలకెత్తని సోయాబీన్ పొలాలను పరిశీలించిన అధికారులు   •   డిబిఎమ్ 6 కాల్వకు గండి   •   ఓస్ట్‌ఫాలియా యూనివర్సిటీతో శాతవాహన అవగాహన ఒప్పందం   •   సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎస్పి తనిఖీ   •   అమలు కానీ హామీలతో ప్రజల చెవిలో పూలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం   •   ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •   కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •  

ఖర్గేను అవమానించడం తగదు

21-09-2024 02:35 AM

ప్రియాంక గాంధీ

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను ప్రధాని మోదీ అగౌరవపరచడం సరికాదని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ఖర్గే రాసిన లేఖకు బదులు ఇవ్వకుండా ప్రధాని ఆయన్ను అవమానించారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య సంప్రదాయాన్ని అత్యున్నత స్థాయిలో ఉన్న నేతలు పాటించకపోవడం విచారకరమని అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం ఈ విషయమై స్పందిస్తూ ‘బీజేపీ నాయకులు రాహుల్‌పై చేస్తున్న అభ్యంతరకరమైన వ్యాఖ్య ల నేపథ్యంలో ఆయన భద్రత గురించి ఆందోళన చెందిన ఖర్గే ప్రధానికి లేఖ రాశారు. మోదీకి పెద్దలపై గౌరవం, ప్రజాస్వామ్య విలువలపై నమ్మకం ఉంటే ఆయనే స్వయంగా లెటర్ రాసేవారు. కానీ నడ్డా ద్వారా తిరిగి లేఖ రాయించారు. అందులోనూ నాయకుడిని అవమానించారు. ప్రధాని తన హోదాను గుర్తించుకొని సమాధానం ఇచ్చి ఉంటే బాగుండేది” అని ప్రియాంక మండిపడ్డారు.