20 March, 2026 | 9:06 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలి

17-03-2025 12:59 AM

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్, మార్చి 16(విజయక్రాంతి): వేసవిలో అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ విద్యుత్తు శాఖ అధికారులకు సూచించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని మంబోజిపల్లి  ఏరియాలో 33/11 కె.వి విద్యుత్ సబ్ స్టేషన్ ను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యుత్ సరఫరా ఇన్ పుట్, ఔట్ పుట్  గురించి,  ట్రాన్స్ ఫార్మర్లు, ఫీడర్ల గురించి విద్యుత్ శాఖ ఎస్సీ శంకరును అడిగి తెలుసుకున్నారు.   నిరంతరాయ విద్యుత్ అందించడంపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వేసవిలో విద్యుత్ వినియోగం పెరుగుతుందని, పెరుగుదలకు అనుగుణంగా ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించారు.

వేసవిలో విద్యుత్ వినియోగం పెరిగే అవకాశమున్నందున, ముందస్తు ప్రణాళికలతో అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, లైన్లు, ఇతర సాంకేతిక పరంగా ఎదురయ్యే అంశాలలో లోపాలు ఉంటే వెంటనే సరిచేయాలని తెలిపారు. అదనపు ట్రాన్స్ఫా ర్మర్లు సిద్ధంగా ఉంచడం, లోడ్ మేనేజ్మెంట్కు ప్రత్యేక ప్రణాళిక రూపొందించడం వంటి చర్యలను అమలు చేయాలని పేర్కొన్నారు. జిల్లాలో 33/11 కెవి ఉప విద్యుత్ కేంద్రాలు 126 ఉన్నాయని, వాటి పరిధిలో ప్రతి రోజు విద్యుత్తు వినియోగం నమోదులు చేయాలని ఆదేశించారు. సిబ్బంది చాలా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా వ్యవసాయ, పారిశ్రామిక, గృహ వినియోగ దారులకు అంతరాయం లేకుండా 24 గంటలు నిరంతరం సరఫరా ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్తు శాఖ ఎస్.ఈ శంకర్, విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.