04-06-2025 12:10:52 AM
మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్
మేడ్చల్, జూన్ 3 (విజయ క్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు మెరుగుపడితే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ అన్నారు. మంగళవారం కుషాయిగూడ, అల్వాల్ పి హెచ్ సి లకు మహతి ఫౌండేషన్ సహకారంతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అందించిన క్యాన్సర్ పరీక్ష పరికరాలు అందజేసే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈటెల రాజేందర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యానికి అయ్యే ఖర్చు ప్రజలకు అనుకోకుండా వచ్చేదన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం అందితే ప్రజలకు ఎంతో ఆదా చేసినట్లు అవుతుందన్నారు. వైద్యానికి ఆయన ఖర్చు వల్ల ఎన్నో కుటుంబాలు అప్పుల పాలయ్యాయి అన్నారు. ఎంత టెక్నాలజీ పెరిగిన క్యాన్సర్ మరణాలు రోజురోజుకు పెరుగుతున్నాయన్నారు.
మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలకు వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ కార్పొరేటర్ చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి, డి ఎం హెచ్ ఓ డాక్టర్ సి ఉమా గౌరీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సిజిఎం బద్రీనాథ్, నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ మెంబర్ శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్ రమేష్ శేఖర్ రెడ్డి, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మాణిక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.