28-06-2025 12:00:00 AM
ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మాట్లాడిన ఐటీడీఏ పీవో రాహుల్
భద్రాచలం, జూన్ 27 ( విజయ క్రాంతి)అధికారులు సిబ్బంది అందరం కలిసి మెలసి ఐకమత్యంగా ఉండి ఒక ప్రణాళిక ప్రకారం కష్టపడి పనిచేయడం వలన అనుకున్నది సాధించి ఐ టి డి ఏ కు జాతీయస్థాయిలో మంచి గుర్తింపు వ చ్చేలా కృషి చేశామని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.శుక్రవారం నాడు ఐటిడిఏ సమావేశ మందిరంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా బాధ్యతలు తీసుకొని సంవత్సరం కాలం పూర్తి అయినందున ఐటీడీఎ యూనిట్ అధికారులు, సిబ్బంది ఏర్పాటుచేసిన వార్షికోత్సవ కార్యక్రమములో ఆ యన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలో స్థానిక సంస్థల జేసీగా పనిచేసిన సమయంలో విద్యార్థుల విద్యాభివృద్ధికి నా సొంతంగా కొన్ని నిర్ణ యాలు తీసుకొని కార్యక్రమాలకు రూపొందించి అమలు చేయడం వలన సత్ ఫలితాలు పొందామని,, అదే తరహాలో ఐటీడీఏ పీవో గా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి గిరిజన సంక్షేమానికి నా వంతు సేవలు అందించాలని దృక్పథంతో ముఖ్యంగా గిరిజన విద్యపై ప్రత్యేక దృష్టి సారించానని,
అందుకు గిరిజన విద్యను పునాది నుండి విద్యార్థులను బలోపేతం చేయడానికి ఉద్దీపకం వర్క్ బుక్ ప్రవేశపెట్టడం జరి గిందని, మంచి ఫలితాలు వచ్చాయని అలాగే పదవ తరగతి అయిన తర్వాత గిరిజన విద్యార్థులు వారు అనుకున్నది సాధించడానికి వివిధ శాఖల అధికారులతో కెరీర్ గైడెన్స్ కార్యక్రమం రూపొందించడం జరిగిందని దాంట్లో కూడా మంచి ఫలితాలు వచ్చాయని అన్నారు.
అధికారుల అందరి పర్యవేక్షణ వలన ఈ సంవత్సరం పదో తరగతి ఫలితాలు 100% సాధించడం జరిగిందని, గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు అంతరించిపోకుండా మ్యూజియం రూపకల్పన చేయడానికి అందరూ అధికారులు, క్రింది స్థాయి సిబ్బంది సహకరించడం వలన మ్యూజియం సర్వ సుందరంగా తయారు చేయడం వలన రాష్ట్రస్థాయిలోనే కాక జాతీయ స్థాయిలో మంచి గుర్తిం పు వచ్చిందని అన్నారు.
ఇంత గుర్తింపు రావడానికి మనమందరం ప్రణాళిక ప్రకారము పనిచేయడం వలన సాధ్యమైందని అన్నారు. అలాగే కోయ భాష నేటితరం బాలబాలికులకు తెలియజేసే విధంగా కోయ భాషలోనే వివిధ కరపత్రాలు ప్ర చురించడం జరిగిందని,ప్రస్తుతం మన ఐటీడీఏకు పూర్వ వైభవం వస్తున్నదని, ప్రస్తుతం గిరిజనుల సంక్షేమంతో పాటు ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరా సౌర గిరి జల వికాసం, రాజీవ్ యువ వికాసం, గిరిజన మహిళల కొరకు ఇసుక ర్యాంపుల నిర్వహణ వంటి పథకాలు ఐటిడిఏ ద్వారానే అమలవుతున్నాయని అన్నారు.
ఈ సంవత్సరం గిరిజన విద్యపై ప్రత్యేక దృష్టి పెడతామని, ఉద్దీపకం వర్క్ బుక్ నిర్వహణ అనేది తప్పనిసరిగా పాఠశాలలో అమలు చేస్తున్నామని, ప్రతి గిరిజన సం క్షేమ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, ప్రతి పాఠశాలల్లో సాంస్కృతి సాంప్రదాయాల పరంగా అదనంగా ఒక పీరియడ్ నిర్వహించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని, గిరిజన నిరుద్యోగ యువతీ యువ కులకు వివిధ రకాల గ్రూప్ శిక్షణ అందించడానికి ప్రయత్నిస్తున్నామని అలాగే వ్యవసాయం, హార్టికల్చర్ అభివృద్ధికి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు.
ఇదే స్ఫూ ర్తితో అధికారులు సిబ్బంది అందరం కలిసికట్టుగా మన ఉద్యో గ ధర్మాన్ని సక్రమంగా నిర్వహించి గిరిజనులకు మన వంతు సహాయ సహకారాలు అందించి ఐటీడీఏకు మంచి పేరు ప్ర ఖ్యాతులు వచ్చేలా కృషి చేయాలని సిబ్బందికి సూచించా రు.
అనంతరం యూనిట్ అధికారులు సిబ్బంది అందరి సమక్షంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన అనంతరం పిఓను ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందించారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ, ఆర్సిఓ గురుకులం అరుణకుమారి,ఈ ఈ ట్రైబల్ వెల్ఫేర్ హరీష్, ఎస్ ఓ భాస్కర్, ఉద్యానవన అధికారి ఉదయ్, తదితరులు పాల్గొన్నారు.