24-06-2025 01:44:15 AM
హైదరాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): డీఎస్సీ స్పోర్ట్స్ కోటా తుది నివేదికను బహిర్గతం చేసి తమకు ఉద్యోగాలివ్వాలని అభ్య ర్థులు డిమాండ్ చేస్తూ సోమవారం పాఠశాల విద్యాశాఖ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి పదుల సంఖ్యలో అభ్యర్థులు జిల్లాల నుంచి రావడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
చిన్నారులను తీసుకొని కొంత మంది మహిళలు రోడ్డుపైనే బైఠాయించారు. డీఎ స్సీ స్పోర్ట్స్ కోటా ఫలితాలు ప్రకటించాలని ఫ్లకార్డులు పట్టుకొని నినదించారు. సీఎం తాత మా అమ్మకు రావాల్సిన ఉద్యాగాన్ని ఇప్పించండని ఓ చిన్నారి ఫ్లకార్డు ప్రదర్శించడం అందర్ని కలిచివేసింది. ఆందోళన స మాచారం అందుకున్న పోలీసులు, పలువురు అభ్యర్థులను పోలీస్ స్టేషన్లకు తరలిం చారు.
ఈ సందర్భంగా పలువురు అభ్యర్థు లు మాట్లాడుతూ స్పోర్ట్స్ కోటాలో అవినీతి జరిగిందని, ఒక్కో పోస్టుకు రూ.10 లక్షల నుంచి 15 లక్షల వరకు తీసుకొని పోస్టులు కట్టబెట్టినట్టు తమ దృష్టికి వచ్చిందని ఆరోపించారు. సర్టిఫికెట్ రీవెరిఫికేషన్ నివేదికను గత ఆరు నెలలుగా అధికారులు తొక్కిపెట్టారని, దాన్ని విడుదల చేసి తమకు ఉద్యో గాలివ్వాలని డిమాండ్ చేశారు.
తప్పించుకొనే ప్రయత్నం..
అధికారులు ఒకరిపైఒకరు తప్పులను నెట్టేసుకుంటున్నారని డీఎస్సీ స్టోర్ట్స్ కోటా అభ్యర్థి రమేశ్ తెలిపారు. స్పోర్ట్స్ అథారిటీ వద్దే తప్పు జరిగిందని పాఠశాల విద్యాశాఖ అధికారులు చెబుతుంటే, కాదుకాదు పాఠశాల విద్యాశాఖ వద్దే ఇదంతా జరిగిందని పాఠశాల విద్యాశాఖ సమాధానాలు చెబుతుండటం అధికారుల నిర్లక్ష్యానికి సాక్ష్యమ న్నారు.
ఇలా ఒకరిమీద ఒకరు తప్పులను నెట్టేసుకుంటూ తప్పించుకొనే ప్రయత్నం చేస్తూ తమకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా త్వరలోనే తుది జాబితాను బయట పెడతామని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తమకు హామీ ఇచ్చినట్టు ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా స్పోర్ట్స్ కోటా కింద అనర్హులకు ఉద్యోగాలిచ్చిన 33 మందిలో 20 మందికిపైగా అనర్హులు ఉన్నారని గుర్తించినట్టు సమాచారం. ఈ అంశం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది.