28-09-2025 10:39:26 PM
చిట్యాల (విజయక్రాంతి): చిట్యాల మాజీ జెడ్పిటిసి శేపూరి రవీందర్ గత కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో చికిత్స చేసుకొని వారి నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న సందర్భంగా మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి ఆదివారం రవీందర్ ఇంటికి వచ్చి పరామర్శించారు. రవీందర్ ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రేగట్టే మల్లికార్జున్ రెడ్డి, గోపగోని వెంకటనారాయణ గౌడ్, చిట్యాల పట్టణ అధ్యక్షుడు పొన్నం లక్ష్మయ్య గౌడ్, మందడి జనార్దన్ రెడ్డి, రామగిరి జనార్దన్ రావు, గౌస్, తులసి, తదితరులు పాల్గొన్నారు.