23-06-2025 12:00:00 AM
జనసేన జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఆవుల సాగర్
మందమర్రి, జూన్ 22 : కార్యకర్తల సంక్షేమమే జనసేన పార్టీ లక్ష్యమని, కార్యకర్తలకు ఎల్లవేళలా పార్టీ అండగా నిలుస్తుందని జనసేన పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు ఆవుల సాగర్ అన్నారు. పట్టణంలోని మందమర్రి (వి) లో ఆదివారం కార్యకర్తలకు పార్టీ సభ్యత్వ నమోదు పత్రాలను, గుర్తింపు కార్డులను పంపిణీ చేసి మాట్లాడారు.
పార్టీలో క్రియాశిలక సభ్యులకు 5లక్షల ప్రమాదభీమా, హాస్పిటల్ ఖర్చులకు రూ. 50 వేల వరకు ఆర్థిక సహాయం, కేవలం 500 రూపాయలకే రూ.5 లక్షల ప్రమాదభీమా ఇవ్వడం అనేది దేశంలో ఏ రాజకీయా పార్టీలో లేని విధంగా పార్టీ కార్యకర్తల కోసం ఆలోచించడం అధినేత పవన్ కళ్యాణ్ గొప్పతనం అని ఆయన కొనియాడా రు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మేకల పవన్ కళ్యాణ్, రోడ్డ శేఖర్, ఆర్చనపెల్లి చరణ్, ఆవుల శ్రావణ్, యాదగిరి ప్రసాద్, ఈశ్వర్, కళ్యాణ్, అజయ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.