23-06-2025 12:00:00 AM
ఖానాపూర్ ఫారెస్ట్ డివిజన్ అధికారి భవాని శంకర్, ఎఫ్ఆర్ఓ కిరణ్ కుమార్
ఖానాపూర్ (విజయక్రాంతి) అంతర్జాతీయ స్థాయిలో అంతరించిపోతున్న అడవి జంతువులను స్మగ్లింగ్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని, దానికి శిక్షలు కూడా అంతే కఠినంగా ఉంటాయని ఖానాపూర్ ఫారెస్ట్ డివి జన్ అధికారి భవాని శంకర్, ఫారెస్ట్ రేంజ్ అధికారి కిరణ్ కుమార్ అన్నారు. ఇటీవల ఖానాపూర్ కేంద్రంగా మండలంలోని అడవి సారంగాపూర్, పాంగిడి అటవీ ప్రాంతంలో అంతరించిపోతున్న అరుదైన జాతి ఆలుగ ను అక్రమంగా స్మగ్లర్లు తరలిస్తుండగా వారి ని అటవీ అధికారులు పట్టుకున్నారు.
ఈ మేరకు ఆదివారం అధికారులు విలేకరుల సమావేశం నిర్వహించారు .ఈనెల 19న మండలం లోని రాజుర గ్రామపంచాయతీ పాంగిడి గ్రామంలో నుంచి ఆలుగను కార్లో తరలించకపోతున్నారని సమాచారం అంద గా, పట్టణంలోని తెలంగాణ చౌక వద్ద అటవీ అధికారులు నిందితులు ఫయాజ్, ఆరిఫ్, గంగా ప్రసాద్లను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా,
మరో ఏడు మంది టేకం గణేష్, ఆత్రం బారిక్ రావు, వెడ్మ నగేష్, కుడిమేత విజయ్, మడావి శ్రీరాం, కొడాలి నాగోరావు అలియాస్ నగేష్, కోరు ట్ల పట్టణానికి చెందిన మొహమ్మద్ రియాజ్ ఉన్నారన్న సమాచారం అధికారులకు తెలిసిందని ,ఖానాపూర్ పట్టణం లో ఒక ఇంట్లో దానిని దాచి ఉంచగా దానికోసం అటవీ అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆలుగను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కు పంపిస్తున్నట్లు తెలిపారు.
ఈ స్మగ్లింగ్లో ఉన్న నిం దితులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని నిజామాబాద్ నిర్మల్ జగిత్యాల పట్టణానికి చెందినవారు ఈ స్మగ్లింగ్లో ఉన్నట్లు తమకు సమాచారం ఉందని, శాఖ పరంగా తదుపరి చర్యలు ఉంటాయని వారు అన్నారు.