4 July, 2026 | 10:34 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

జానీ మాస్టర్‌పై జనసేన చర్యలు.. పార్టీకి దూరంగా ఉండాలని ఆదేశం

16-09-2024 04:56 PM

హైదరాబాద్: జానీ మాస్టర్‌పై జనసేన పార్టీ చర్యలు చర్యలు తీసుకుంది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. అత్యాచార ఆరోపణలు రావడంతో జనసేన చర్యలు తీసుకుంది. జాతీయ అవార్డు గ్రహీత కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని 21 ఏళ్ల మహిళా కొరియోగ్రాఫర్  పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసు అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉంటే, జనసేన సభ్యుడైన జానీ మాస్టర్‌పై చర్య తీసుకుంటారనే ప్రశ్నలు నడుమ జనసేన నిర్ణయం సంచలనంగా మారింది.

జనసేన పార్టీ సభ్యుడు జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలతో సీరియస్‌గా వ్యవహరించాలని పార్టీ సభ్యత్వాన్ని సస్పెండ్ చేయాలని పవన్ కళ్యాణ్‌తో పాటు కొంతమంది నెటిజన్లు ఏపీలోని ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో జానీ మాస్టర్ పవన్ సమక్షంలో జనసేన పార్టీలో చేరి ఆ పార్టీ తరపున చురుగ్గా ప్రచారం చేశారు. మహిళ ఫిర్యాదుతో జానీ మాస్టర్ పై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 376, 506, 323 కింద కేసు నమోదు చేశారు. లైంగిక వేధింపుల నిరోధక చట్టం (పీఓఎస్‌హెచ్) కింద అంతర్గత విచారణ జరిపి పోలీసులతో కేసు నమోదు చేయాలని తెలంగాణ మహిళా భద్రతా విభాగం డైరెక్టర్ జనరల్ శిఖా గోయెల్ చిత్ర పరిశ్రమకు సూచించారు.