9 May, 2026 | 10:40 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

సికింద్రాబాద్‌లో జన్మభూమి ఎక్స్‌ప్రెస్ స్టాప్ రద్దు

13-03-2025 01:26 PM

హైదరాబాద్: భారతీయ రైల్వే శాఖ గురువారం నాడు మరో కీలక ప్రకటన చేసింది. హైదరాబాద్ నుంచి శిశాఖపట్నం- విశాఖపట్నం నుంచి హైదరాబాద్ కు వెళ్లే ప్రయాణికులకు రైల్వే శాఖ అలర్ట్ చేసింది. ఏప్రిల్ 25 నుంచి ప్రతిరోజూ నడిచే జన్మభూమి ఎక్స్‌ప్రెస్(Janmabhoomi Express) సికింద్రాబాద్ స్టాప్ రద్దు అయింది. విశాఖ-లింగంపల్లి(Visakhapatnam and Lingampalli) విశాఖ జన్మభూమి ఎక్స్ ప్రెస్ ప్రయాణ మార్గం మళ్లించామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలును ఇప్పుడు శాశ్వతంగా చర్లపల్లి-అమ్ముగూడ-సనత్‌నగర్ మీదుగా మళ్లిస్తారు. ఏప్రిల్ 25 న లింగపల్లి నుంచి చర్లపల్లి మీదగా జన్మభూమి ఎక్స్‌ప్రెస్ విశాఖ రానుందని అధికారులు వెల్లడించారు.