13 April, 2026 | 1:54 AM

ఇంటర్ ఫలితాల్లో జయ కాలేజీ విద్యార్థుల ప్రభంజనం

13-04-2026 12:00 AM

సూర్యపేట, ఏప్రిల్ 12 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో జయ కాలేజీ విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంక్ లు సాధించి ప్రభంజనం సృష్టించారని జయ కలాశాల నిర్వాహకులు తెలిపారు. ఎంపీసీ మొదటి సంవత్సరం ఫలితాల్లో 460 కి పైగా 43 మందికి, 450 పైగా 84 మంది విద్యార్థులు మార్కులు సాధించారు.

బైపిసి మొదటి సంవత్సరంలో యం. ప్రగతి ఇవాంజలిన్ 440 మార్క్ లకు గాను 438 మార్కులు  సాధించి రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించినట్లు తెలిపారు. ఎంపీసీ రెండవ సం.లో 980 పైన 32 మంది, 950 పైన 109 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి మార్కులు సాధించినట్లు తెలిపారు. ఈ రాష్ట్ర స్థాయి మార్కులు సాధించిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు, ఈ విజయానికి కృషి చేసిన అధ్యాపకులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాలేజీ లెక్చరర్లు, స్టాప్ తదితరులు పాల్గొన్నారు.