calender_icon.png 5 June, 2025 | 2:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన జాబ్ మేళా

27-05-2025 12:00:00 AM

గుంటూరు, మే 26: చలపతి ఇనిస్టిట్యూ ట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్‌లో నిర్వహించిన మెగా జాబ్ మేళ వైభవంగా జరి గిందని ప్రిన్సిపాల్ నాదెండ్ల రామారావు తెలిపారు. సోమవారం తమ కళాశాల ఆవరణలో ఏర్పాటుచేసిన జాబ్ మేళాలో ఆయ న మాట్లాడారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు అందించడమే లక్ష్యంగా ఈ మేళాను ఏర్పాటు చేశామన్నారు. ఈ జాబ్ మేళాలో ప్రముఖ ఫార్మా కంపెనీలైన నాట్కో, అరబిందో, హెటేరోలు పాల్గొన్నాయన్నారు.

దేశవ్యాప్తంగా మంచి పేరున్న కంపెనీలు కావడంతో తెలంగాణ రాష్ట్రం నుంచి 300కు పైగా విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. ఈ ఎంపిక ప్రక్రియలో విద్యార్థులందరికీ మొదటగా రాత పరీక్ష నిర్వహించి, ఉత్తీర్ణులైన విద్యార్థులకు టెక్నిక ల్, హెచ్‌ఆర్ రౌండ్లను నిర్వహించారని తెలిపారు. హెచ్‌ఆర్ రౌండ్‌లో ఉత్తీర్ణులైన విద్యా ర్థులకు ఉద్యోగావకాశాన్ని కల్పించారని తెలిపారు.

నాట్కో ఫార్మా కంపెనీకి 15 మంది, హెటిరో ఫార్మా కంపెనీకి 30 మంది, అరబిందోకు 20 మంది విద్యార్థులు ఎంపిక య్యారన్నారు. అర్హత సాధించిన విద్యార్థులను చలపతి విద్య సంస్థల అధినేత శ్రీ వై వి ఆంజనేయులు  అభినందించారు.

కార్యక్రమంలో నాట్కో ఫార్మా కంపెనీ డిప్యూటీ జన రల్ మేనేజర్ డాక్టర్ రంజిత్ కుమార్, అసిస్టెంట్ మేనేజర్ యూ సుమంత్, డిప్యూటీ అసిస్టెంట్ మేనేజర్ కె గోపికృష్ణ, హెటిరో ఫార్మా కంపెనీ హెచ్‌ఆర్ మేనేజర్ కె సమీర్‌కుమార్, ఎస్‌ఎస్‌ఎస్‌వి ఫర్ అరబిందో హెచ్ ఆర్ మేనేజర్ ఎండి పైసల్,  సీనియర్ ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ కె త్రివిక్రమ్ పాల్గొన్నారు.