08-06-2025 12:00:00 AM
క్యాంపస్ ప్లేస్మెంట్లో సాధించిన స్టూడెంట్స్
కరీంనగర్, జూన్ 7 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల పరిధిలోని జ్యోతిష్మతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నా లజీ అండ్ సైన్స్ కళాశాలకు చెందిన విద్యార్థులు ఎమ్మెన్సీ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. ప్రస్తుతం బీటెక్ నాలుగో సంవత్సరం సీఎస్ఈ, సీఎస్ఎం చదువుతున్న 12 మంది విద్యార్థులు మల్టీ నేషనల్ కంపెనీలో ఏడాదికి రూ.4 లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలు సాధించారు.
ఎస్ శ్రీజ, వై ప్రీతి, ఎస్ విశాఖ, బీ శివాని, పీ మనశ్విని, ఎం శ్రీయ, జుఫీషియఎన్ కుర్షద్, డి అశ్రిత రూ.3.6 లక్షల ప్యాకేజీతో ఇన్ఫోసిస్ కంపెనీలో సిస్టమ్ ఇం జనీర్గా ఉద్యోగాలు సాధించారు. బి వర్షిత, బి హరిణి, ఎస్ అక్షిత్, ఎస్ త్రిష వార్షిక వేతనం రూ.4 లక్షల ప్యాకేజీతో కాగ్నిజెంట్ కంపెనీలో ప్రోగ్రామర్ అనలిస్ట్ ట్రైనీగా ఉద్యోగాలు సాధించారు.
ఈ సందర్భంగా విద్యార్థులను కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్రావు, సెక్రటరీ, కరస్పాండెంట్ జువ్వాడి సుమిత్ సాయి, ప్రిన్సిపాల్ డాక్టర్ టి అనిల్ కుమార్, డీన్ అకాడమిక్ డాక్టర్ పీకే వైశాలి, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు అభినందించారు.