13-06-2025 01:30:21 PM
గద్వాల, (విజయక్రాంతి): అలంపూరు శాంతినగర్ గద్వాల ప్రాంతాలలో స్కూల్ బస్సుల పై ఆర్టీవో అధికారులు(Jogulamba Gadwal district RTO officials ) మూడు బృందాలుగా ఏర్పడి శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆర్టీవో వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులలో విద్యార్థులను చేరవేస్తున్నారనే విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిని ఉంచుకొని ఏకకాలంలో తనిఖీలు నిర్వహించి ఫిట్నెస్ లేని మూడు బస్సులను సీజ్ చేశామని ఆర్టీవో వెల్లడించారు.. జిల్లాలోని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు తప్పనిసరిగా స్కూల్ బస్సులు ఫిట్నెస్ పొందాలన్నారు. రవాణా శాఖ ఉత్తర్వులను ఉల్లంఘించి ఫిట్నెస్ లేని వాహనాలను నడిపితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఈ సందర్భంగా హెచ్చరించారు.