29-05-2025 10:33:17 PM
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): 143 జర్నలిస్టు యూనియన్ రజితోత్సవ పోస్టర్ ను బీఆర్ఎస్ అధినేత, మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య(Former MLA Durgam Chinnaiah) ఆవిష్కరించారు. బెల్లంపల్లి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య టీయూడబ్ల్యూజే 143 జర్నలిస్టు యూనియన్ రజతోత్సవం పోస్టర్లు విడుదల చేశారు. ఈనెల 31న హైదరాబాద్ జలవిహార్ లో యూనియన్ మహాసభ జరగనుంది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ యువజన నాయకులు సబ్బని అరుణ్, మద్దెల గోపి, బెల్లంపల్లి జర్నలిస్టులు బడుగు శ్రీనివాస్, అందుగుల రమేష్, వేముల వెంకటేష్, నామ రవీందర్, గరిగే వేణుగోపాల్, ఇందూరి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.