15 March, 2026 | 11:34 AM

ఫోన్‌ట్యాపింగ్ కేసు.. నిందితుల జ్యూడిషియల్ రిమాండ్ పొడగింపు

31-07-2024 09:28 PM

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుల రిమాండ్ గడువును ఆగస్టు 14 వరకు పొడగిస్తూ నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో అరెస్టు చంచల్‌గూడ జైలులో జ్యూడిషియల్ రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు, టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్‌డీ రాధాకిషన్‌రావు, ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను బుధవారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఇరువైపుల వాదనలు విన్నా న్యాయస్థానం తదుపరి విచారణను ఆగస్టు 14కు వాయిదా వేసింది.