అసెంబ్లీ ఫలితాలు పునరావృతం కావాలి

23-04-2024 02:14:15 AM

l మంత్రి జూపల్లి కృష్ణారావు

నాగర్‌కర్నూల్, ఏప్రిల్22 (విజయక్రాంతి): రాష్ట్రంతోపాటు దేశంలో ఇందిరమ్మ రాజ్యం రావాలంటే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరోసారి పునరావృతం కావాలని ఎక్సైజ్, పర్యాటక శాఖామంత్రి, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల ఇన్‌చార్జి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కొల్లాపూర్ నియోజకవర్గంలోని సింగోటం, జవాయిపల్లి, ఎన్మన్‌బెట్ల గ్రామాల్లో పర్యటించారు. ఇందిరమ్మ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరేలా ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతున్నదని చెప్పారు. పార్లమెంటు ఎన్నికల అనంతరం సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామని స్పష్టంచేశారు. ఇందిరమ్మ రాజ్యం రావాలంటే కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి గెలవాలని అన్నారు. రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలు తప్పకుండా గెలుస్తున్నామని వెల్లడించారు. సింగోటంలో పలువురు యువకులు మంత్రి సమక్షంలో పార్టీలో చేరారు.