30 August, 2026 | 8:26 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేదలకు న్యాయం

14-04-2025 12:00 AM

పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య

నల్లగొండ, ఏప్రిల్ 13( విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య అన్నారు. ఆదివారం నల్లగొండలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్నబియ్యం పథకం పేద ప్రజలకు వరం లాంటిదని అన్నారు. సన్న బియ్యం పథకంతో అన్ని వర్గాల పేద ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారని అన్నారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలన్నింటినీ క్రమం తప్పకుండా అమలు చేస్తూ ముందుకు పోతుందని పేర్కొన్నారు. ఉచిత బస్సు, ఉచిత గ్యాస్ సిలిండర్, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం పథకంతో కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల జీవితాలలో వెలుగును నింపుతుందని అన్నారు.

ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలన్నింటినీ అమలు చేస్తూ మాట నిలబెట్టుకుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పరిపాలన సాగిస్తూ పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని పేర్కొన్నారు.