17 March, 2026 | 4:31 PM

Breaking News

ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేసిన వారిపై తుంగతుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు   •   పదవ తరగతిలో 100% ఫలితాలు   •   చెరువును పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ   •   నందిని సిధారెడ్డికి సీఎం రేవంత్ శుభాకాంక్షలు   •   బావుసాయిపేట రైతు వేదికలో వ్యవసాయ అవగాహన కార్యక్రమం   •   ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలి   •   దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో అస్తవ్యస్త వైద్య సేవలు: బీసీ సంక్షేమ సంఘం ఆగ్రహం   •   తెలంగాణలో హ్యామ్ రోడ్ల పేరిట రూ. 18 వేల కోట్ల స్కామ్   •   ఆత్మగౌరవం చంపుకొని ఉండలేను.. ఫిరాయింపు ఎమ్మెల్యేలను బయటకు పంపాలి   •   కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ నెంబర్   •  

మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి

16-04-2025 11:24 PM

ప్రేమ పేరుతో మోసం చేసిన నిందితుడికి మరణశిక్ష విధించాలి..

దిల్ సుఖ్ నగర్ లో బహుజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ.. 

ఎల్బీనగర్: ప్రేమ పేరుతో అగ్రకులానికి చెందిన వ్యక్తి మోసం చేయడంతో దళిత కుటుంబానికి చెందిన యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై బహుజన విద్యార్థి సంఘం నాయకులు బుధవారం రాత్రి దిల్ సుఖ్ నగర్ నుంచి ముసారాంబాగ్ లోని అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. హాస్టల్ విద్యార్థి మళ్లీశ్వరి మృతికి కారణం అయిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ.. దేశంలో కుల వివక్ష నశించాలన్నారు.

ప్రేమించే సమయంలో గుర్తుకు రాని కులం పెండ్లి చేసుకోవాలని అడిగినప్పుడు గుర్తుకు వస్తుందా? అని ప్రశ్నించారు. మల్లేశ్వరిని అగ్రకులానికి చెందిన వ్యక్తి ప్రేమ పేరుతో మోసం చేశాడని, కులం పేరు చెప్పి పెండ్లికి నిరాకరించి, మరో అమ్మాయిని పెండ్లి చేసుకున్నాడని తెలిపారు. ప్రేమించిన వ్యక్తి తనను మోసం చేశాడనే అవమానంతో స్టాప్ నర్సుగా పని చేస్తున్న దళిత యువతి మల్లేశ్వరి ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితుడికి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశారు.