7 July, 2026 | 2:57 PM

Breaking News

సుద్దాలలో ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం, మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పత్రాలు అందజేత   •   ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు   •   పదవీ విరమణ సేవలకు మాత్రమే… వ్యక్తిత్వానికి కాదు   •   గోపాల్పేట్ గ్రామంలో నూతన సీసీ రోడ్డు పనులు ప్రారంభం   •   బీజేపీలో భారీ మార్పులకు రంగం సిద్ధం?   •   మరోసారి అవకాశం ఇస్తే.. మరింత అభివృద్ధి చేస్తాం   •   TRS పార్టీ పేరుపై ఢిల్లీ హైకోర్టుకు కవిత   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలే లక్ష్యం   •   మార్వాడీ యువ మంచ్ ఆధ్వర్యంలో ఉచిత ఫ్రీజర్ బాక్స్ ప్రారంభం   •  

పోడు రైతులకు న్యాయం చేయాలి

25-03-2025 08:32 PM

ఎమ్మెల్సీ దండే విఠల్..

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఎన్నో ఏండ్లుగా పోడు భూములలో సాగు చేసుకుంటున్నా రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు. మంగళవారం జిల్లా అటవీశాఖ అధికారి నీరజ్ కుమార్ కు రైతులతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ... అటవీ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు తాగునీటి కోసం బోర్లు వేసుకునే అవకాశం కల్పించాలని, తాతల కాలం నుండి సాగు చేస్తున్న పోడు భూముల్లో కందకాలు తవ్వకూడదన్నారు. రెవెన్యూ, ఫారెస్ట్ శాఖల మధ్య రైతులు నలిగిపోతున్నారని జాయింట్ సర్వే నిర్వహించి రైతులకు న్యాయం చేయాలని డీఎఫ్ఓ ను కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్ గణపతి, నాయకులు నానయ్య, విశ్వేశ్వర్, ఉమా మహేష్, సురేష్, పోడు రైతులు పాల్గొన్నారు.