17 April, 2026 | 3:12 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

ఝరి గ్రామంలో కబడ్డీ పోటీలు ప్రారంభం

14-02-2026 09:50 PM

తలమడుగు,(విజయక్రాంతి): మండలంలోని ఝరీ గ్రామ శ్రీ రాజరాజేశ్వరీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహా శివరాత్రి సందర్భంగా కబడ్డీ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు నారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మహాశివరాత్రినీ పురస్కరించుకొని క్రికెట్, కబడ్డీ పోటీలను నిర్వహించి దాతల సహకారంతో బహుమతులను అందజేస్తున్నామన్నారు.

ఉత్సాహవంతులైన క్రీడాకారులు పోటీలలో పాల్గొని బహుమతులు గేలుసుకోవచ్చని అన్నారు. అలాగే రేపు జరగబోయే రాజరాజేశ్వరీ కళ్యాణం లో శివ భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మెస్రం రూప కాశీరాం, కబడ్డీ బహుమతి  ప్రదాతలు రాంబాయి, నక్క ధనంజయ్, పునగూడా సర్పంచ్ హనుమంతు, రత్నాపూర్ సర్పంచ్ సూర్య భాను, జైత్ పటేల్, భుజంగ రావు, తదితరులు పాల్గొన్నారు.