21-06-2025 12:51:49 AM
హైదరాబాద్, జూన్ 20 (విజయక్రాంతి): సొంత పార్టీ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్రెడ్డిలపై మంత్రి కొండా సురేఖ ఘాటు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం సచివాలయంలోని తన ఛాంబర్లో మీడియాతో మంత్రి సురేఖ చిట్ చాట్ చేశా రు. ఆమె మాట్లాడుతూ.. “కడియం శ్రీహరి నల్లికుట్లోడు. నేను మంత్రిగా ఉంటే తట్టుకోలేకపో తుండు. పదే పదే రేవంత్రెడ్డి దగ్గర, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి దగ్గర నామీద చాడీలు చెపుతుండు.
నాకు అదృష్టం ఉంది కాబట్టి మంత్రి అయ్యాను. ఆయనకు అదృ ష్టం ఉన్నప్పుడు ఆయన కూడా మంత్రి అయ్యాడు. తరచూ నేను దిగిపోవాలని మా ట్లాడటం సరికాదు. నా కూతురికి అదృష్టం లేదు ఎమ్మెల్యే కాలేదు. కడియం కూతురికి అదృష్టం ఉంది ఎంపీ అయ్యింది. నేను మం త్రిగా ఉంటే నా ముందు కూర్చోవడానికి నామోషీగా ఫీల్ అవుతున్నారు. అందుకే నా మంత్రి పదవి పోతదని కడియం ప్రచారం చేస్తుండు.
టీడీపీ, బీఆర్ఎస్లో చెప్పుడు మాటలతో సాగిచ్చుకున్నట్లు కాంగ్రెస్లోనూ సాగించాలని చూస్తుండు, కానీ ఆయన మాయలు ఇక్కడ సాగవు” అని వ్యాఖ్యానించారు. నాయిని రాజేందర్రెడ్డి గురించి మాట్లాడుతూ.. “రాజేందర్రెడ్డి ప్రెస్మీట్ పెట్టి మాట్లాడటం సరికాదు. ఆయన అభివృద్ధిని అడ్డుకుంటున్నారు” అని వ్యాఖ్యా నించారు.
గోదావరి పుష్కరాల విషయంలో రెండు రాష్ట్రాలను కేంద్రం సమానంగా చూ డాలని మంత్రి సురేఖ కోరారు. పుష్కరాలకు రూ.200 కోట్లు ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాశామని చెప్పారు. తెలంగాణపై వివక్ష వద్ద ని, కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజ య్ ప్రత్యేక చొరవ తీసుకుని పుష్కరాల కోసం నిధులు ఇప్పించాలన్నారు. లేదంటే వారు చేతగాని మంత్రులుగా మిగిలిపోతారని విమర్శించారు.
భద్రకాళి అమ్మవారి బోనాలు తాత్కాలిక వాయిదా
వరంగల్ భద్రకాళి అమ్మవారి బోనాలు ఘనంగా నిర్వహించాలని గతంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. భద్రకాళి అమ్మవారి బోనాలకు సంబంధించి కొంత మంది నుంచి అభ్యంతరాలు వెలువడిన నేపథ్యంలో, పలు మాధ్యమాల్లో ఈ విషయంపై తప్పుడు వార్తలు ప్రచురితం కావడంతో ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు శుక్రవారం ప్రకటనలో మంత్రి పేర్కొన్నారు.
స్థానికంగా నెలకొన్న రాజకీయ విభేదాలను పవిత్రమైన అమ్మవారికి ముడిపెట్టి కొంత మంది ఉద్దేశపూర్వ కంగా ఇబ్బందులు సృష్టిస్తారేమోనని, ఈ కార్యక్రమంలోకి అసాంఘిక శక్తులను ప్రేరేపించి గోడవలు సృష్టిస్తారన్న అనుమానం తో బోనాల నిర్వహణ రద్దు చేస్తున్నట్లు తెలిపారు. భద్రకాలి అమ్మవారి ఆలయం పరిధి లో శాఖహార బోనాలే ఉంటాయని, స్థానిక ఈవో, వేదపండితులు, ప్రభుత్వం కూడా పలుమార్లు పునరుద్ఘాటించినట్లు మంత్రి సురేఖ వివరించారు.
ఆగమశాస్త్రం ప్రకారమే, వేద పండితుల నిర్ణయం మేరకు భద్రకాళి టెంపులో నిర్వహిస్తామన్నారు. కొంతమంది మాంసాహారంతో బోనాలు నిర్వహిస్తున్నట్లు చెప్పడంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయన్నారు. అక్కడ ఏళ్లుగా పనిచేస్తున్న పూజార్ల అభిప్రాయం తీసుకున్నామని పేర్కొన్నారు. బల్కంపేట దేవాలయం నుంచి బోనం తీసుకువెళ్లి భద్రకాళి అమ్మవారికి సమర్పిస్తాం అని ప్రకటనలో పేర్కొన్నారు.