21-06-2025 12:50:38 AM
కామారెడ్డి, జూన్ 20,(విజయ క్రాంతి) మాదక ద్రవ్యాల నిరోధానికి ప్రతిఒక్కరూ కట్టుబడి ఉండాలని ఎల్లారెడ్డి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ గాంధీ పేర్కొన్నారు. ఎల్లారెడ్డి మోడల్ స్కూల్లో శుక్రవారం మాదక ద్రవ్యాల నిరోధంపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.
అనంతరం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయన్నారు. డ్రగ్స్ అమ్ముతున్నట్లుగా ఎవరికైనా సమాచారం తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు.