మైబూబి మృతదేహానికి కమల్ నివాళి
04-05-2026 05:46 PM
సత్తుపల్లి,(విజయక్రాంతి): పట్టణంలోని ఎన్టీఆర్ నగర్ కాలనీకి చెందిన సత్తార్ వారి సతీమణి మైబుబి గుండెపోటుతో సోమవారం మృతి చెందినారు. ఆమె మరణ వార్త తెలుసుకున్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు కమల్ పాషా వారి స్వగృహానికి వెళ్లి, ఆమె మృతదేహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు సంతాపం సానుభూతి వ్యక్తం చేశారు. సంతాపం వ్యక్తం చేసిన వారిలో కౌన్సిలర్లు శరత్ చంద్ర, జగన్నాథం శ్రీను,చిలగుండ్ల వెంకటేశ్వరరావు,నిరుడు రాజేష్ లు ఉన్నారు.






