విద్యార్థుల కృషి అభినందనీయం
కన్నాల సర్పంచ్ గుడిసె గట్టయ్య యాదవ్
మంథని,(విజయక్రాంతి): మంథని మండలంలోని కన్నాల హైస్కూల్ లో 10వ తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం పట్ల గ్రామ సర్పంచ్ గుడిసె గట్టయ్య ఉపాధ్యాయులను అభినందించారు. గత రెండు సంవత్సరాల నుండి 100 శాతం ఉత్త్తీర్ణత సాధిస్తున్నందుకు పాఠశాల ఉపాధ్యాయుల కృషి వల్లే సాధ్యమైయిందని అన్నారు. ఈ సంవత్సరం మంథని మండలం లో జిల్లా పరిషత్ పాఠశాల లో రెండవ టాపర్ గా నిలిచి 545 మార్కులు సాధించి కన్నాల జడ్పీహెచ్ఎస్ మొదటి స్థానం లో నిలిచిన తస్మిరాను తల్లి, తండ్రి సమక్షంలో శాలువా తో ఘనంగా సన్మానించారు. అలాగే శ్రీవన్, రాంచరణ్, అభిరుద్, వర్షిత్, అంజలి, అలీషా తదితరులు రూ. 500 లకు పైన మార్కులు సాధించడం పట్ల వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమం లో ఇంచార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు కానుగంటి శ్రీనివాస్, వార్డ్ మెంబెర్ కీర్తన, విద్యార్థులు, పేరెంట్స్ పాల్గొన్నారు.






