15-02-2026 02:34:42 PM
హైదరాబాద్: సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి సందర్భంగా అందరికీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ జాగృతి కార్యాలయంలో బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ 287వ జయంతి వేడుకల్లో ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా భోగ్ బండార్ నిర్వహించి, సేవాలాల్ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బంజారాల్లో సామాజిక, ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపిన దార్శనికుడు సేవాలాల్ మహరాజ్ సమానత్వం, సేవ, ధర్మం కోసం జీవితాన్ని అంకితం చేసిన సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్.రూప్ సింగ్, పలువురు బంజారా పూజారులు, జాగృతి బంజారా నాయకులు పాల్గొన్నారు.