7 April, 2026 | 5:15 PM

Breaking News

ఎమ్మెల్యే విజయ రమణారావుకు నిలువెత్తు దండతో ఘనంగా సన్మానం   •   చంద్ర మహంకాళి ఆలయంలో పూజలు   •   గోపాల్పేట్ శ్రీ నల్లపోచమ్మ నూతన ఆలయ కమిటీ ఎన్నిక   •   పేదల స్వంతింటి కల కాంగ్రెస్‌తోనే సాకారం: ధరావత్ వీరన్న నాయక్   •   'టచ్ చేసి చూడు.. పాకిస్థాన్‌ ముక్కలే'! పాక్‌కు భారత్ స్ట్రాంగ్‌ వార్నింగ్‌   •   గిరిజన గ్రామంలో పోలీసుల గ్రామోత్సవం నిర్వహణ   •   రసాయనాల నియంత్రణతో క్యాన్సర్ నివారణ   •   ఘనంగా జీవీఆర్ జన్మదిన వేడుకలు   •   పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మూడేళ్లు పూర్తయిన సందర్భంగా కేక్ కటింగ్   •   ఐఎన్టీయుసీ కాంట్రాక్ట్ యూనియన్ ఉపాధ్యక్షుడిగా ఎస్కే బాజీ సాహెబ్   •  

గిరిజనులను స్వయం పాలకులుగా చేసిన ఘనత కేసీఆర్ గారిదే

15-02-2026 02:47 PM

హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో జరిగిన సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకల్లో  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... తండాల తలరాతను మార్చి, గిరిజనులను స్వయం పాలకులుగా చేసిన ఘనత బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ దే అని గుర్తు చేశారు. గతంలో గిరిజన బిడ్డలకు 4.50 లక్షల ఎకరాల పోడు పట్టాలు అందించి వారి ఆత్మగౌరవాన్ని కేసీఆర్ నిలబెట్టారని చెప్పారు. గిరిజన బిడ్డలైన బంజారాల ఆత్మగౌరవాన్ని ఆకాశమంత ఎత్తున నిలబెట్టేందుకు హైదరాబాద్ నడిబొడ్డున బంజారాహిల్స్‌లో బంజారా భవన్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిందని ⁠బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, వి.శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే అనిల్ జాదవ్, బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ ఎస్ ప్రవీణ్, ఖానాపూర్ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ జాన్సన్ నాయక్, బీఆర్ఎస్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.