07-06-2025 11:14:39 PM
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) బెల్లంపల్లి వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్ర కాయకల్ప క్వాలిటీ బృందం శనివారం విజిట్ చేసింది. ఏరియా ఆసుపత్రిలో వైద్య సేవలు, పారిశుద్ధ్యం వైద్యుల సేవా తీరును పరిశీలించారు. రోగులకు తగిన వసతులు, వైద్య సేవలతో పాటు ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించారు. కాయకల్ప స్టేట్ క్వాలిటీ బృందానికి ఆస్పత్రి సూపర్డెంట్ రవికుమార్, వైద్య సిబ్బంది ఘనంగా స్వాగతం చెప్పారు. కాయకల్ప స్టేట్ క్వాలిటీ బృందం ఆస్పత్రిలో సకల సేవలను పరిశీలించిన పిమ్మట సంతృప్తినీ వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాయకల్ప రాష్ట్ర క్వాలిటీ బృందం వైద్యులు కృష్ణ, కవిత ఆస్పత్రి వైద్య సిబ్బంది ఉన్నారు.