02-06-2025 02:23:06 AM
హైదరాబాద్, జూన్ 1 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్య మంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాం క్షలు తెలిపారు. శాంతియుతంగా పార్లమెంటరీ పంథాలో కొట్లాడి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామని, ఉమ్మడి రాష్ట్ర పాలనలో ఆగమైన తెలంగాణను స్వయం పాలనలో అభివృద్ధి చేసుకున్నామని కేసీఆర్ లేఖలో తెలిపారు.
సకల జనుల సంక్షేమాన్ని కొనసాగి స్తూ, సమస్త రంగాల్లో ప్రగతిని సాధిస్తూ, పదేండ్ల అనతికాలంలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలుపు కున్నామని కేసీఆర్ వివరించారు. అదే స్పూర్థిని కొనసాగిస్తూ, అన్ని వర్గాల ప్రజల జీవన విధానం మరింత గుణాత్మకంగా సాగే దిశగా పాలనా ప్రాధాన్యతలను ఎంచుకొని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేసీఆర్ సూచించారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజల్లో విశ్వాసం నింపాలని స్పష్టం చేశారు.