calender_icon.png 3 June, 2025 | 6:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాన్‌సూన్ ఎమర్జెన్సీ టెండర్లను రద్దు చేయాలి

02-06-2025 02:21:11 AM

  1. తక్షణ మరమ్మతుల వ్యవస్థకు సంబంధించినవి కూడా..
  2. బీసీ కాంట్రాక్టర్లకు అన్యాయం చేసేలా ఇంజినీర్ల మార్గదర్శకాలు
  3. కాంట్రాక్టర్లకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి..
  4. సీఎం రేవంత్‌కు ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ

హైదరాబాద్, జూన్ 1 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంఎసీ) ఇంజినీర్లు తమకు అనుకూలంగా ఉన్నవారికి లాభం చేకూర్చాలని చూస్తున్నారని, అదే జరిగితే తెలంగాణకు చెందిన బీసీ బీసీ కాంట్రాక్టర్లకు నష్టపోతారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.

మాన్‌సూన్ ఎమర్జెన్సీ టీమ్స్‌కు సంబంధించిన తక్షణ మరమ్మతుల వ్యవస్థకు విదేశీ సంస్థకు చెందిన వాహనాలను మాత్రమే వినియోగించాలని ఇంజినీర్లు రూపొందించారని పేర్కొన్నారు. ఇంజినీర్లు సూచించే వాహనాలకు సంబంధించి హైదరాబాద్‌లో రెండే రెండు షోరూమ్స్ ఉన్నాయని, ఆ షోరూంల నిర్వాహకులు తెలంగాణకు చెందిన కాంట్రాక్టర్లతో ఎంఓయూ చేసుకునేందుకు ససేమిరా అంటున్నారని వెల్లడిం చారు.

కాంట్రాక్టర్లు కర్ణాటకలోని షోరూం డీలర్ల నుంచి ఎంఓయూలు తెచ్చుకున్నా, వాటి ఫిజికల్ కాపీలు తక్కవ వ్యవధిలో తెచ్చి ఇవ్వాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారన్నారు. నిన్నమొన్నటివరకు జేహెచ్‌ఎంసీ పరిధిలోని 150 వార్డులకు వేర్వేరుగా టెండర్లు పిలిచేవారని, కానీ.. తొమ్మిది జోన్ల వారీగా టెండర్లు పిలుస్తుండటంతో కాంట్రాక్టర్లకు నష్టం వాటిల్లుతుంద న్నారు.

అధికారు లు సూచిస్తున్న వాహనాల్లో ఒక క్యూబిక్ మీటర్ మెటీరియల్‌ను కూడా తరలించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. కాంట్రాక్టర్లు గతంలో వినియోగించిన వాహనాల్లో రెండు నుంచి మూడు క్యూబిక్ మీటర్ల మెటీరియల్ తరలించేవారని గుర్తుచేశారు. అధికారులు ఒక సంస్థకు, రెండు కాంట్రాక్టు ఏజెన్సీలకు లబ్ధి చేకూర్చేలా నిబంధనలు మార్చడంతో ఏడాదికి రూ.5.85 కోట్ల భారం జీహెచ్‌ఎంసీపై పడుతుందని రాసుకొచ్చారు.

రాష్ట్రప్ర భుత్వం వెంటనే ఆ టెండర్లను రద్దు చేసి, గతంలో మాదిరిగా వార్డుల వారీగా టెండ ర్లు పిలవాలని విజ్ఞప్తి చేశారు. అలా చేస్తే 150 మంది స్థానిక కంట్రాక్టర్లకు ఉపాధి లభిస్తుందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా మున్సిపల్‌శాఖను పర్యవేక్షిస్తున్నారని, సీఎం అక్రమాల తావు  లేకుండా చూడాలని కోరారు.

తెలంగాణ జాగృతి అనుబంధ సంస్థగా యూపీఎఫ్: కవిత

జాగృతి అనుబంధ సంస్థగా యు నైటెడ్  ఫూలే ఫ్రంట్ (యూపీఎఫ్) పనిచేస్తుందని ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. హైదరాబాద్‌లోని ‘తెలంగాణ జాగృతి’ కార్యాలయంలో ఆదివారం ఆమె యూపీఎఫ్ నాయకులతో స మావేశమయ్యారు. ఈ సందర్భంగా యూ పీఎఫ్ నూతన కార్యవర్గాన్ని ఎ న్నుకున్నారు.

యూపీఎఫ్ కన్వీనర్‌గా బొల్లా శివశంకర్, కో గట్టు రాంచందర్‌రావుతోపాటు మరో 50 మందిని కో ప్రకటించారు. ఈ సందర్భంగా కవిత మాట్లా డుతూ.. తెలంగాణ జాగృతి, యూపీఎఫ్ ఐక్య పోరాటాల తోనే కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చి బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు విద్యా, ఉద్యోగాల్లో 42శాతం రిజర్వేషన్లు కల్పి స్తూ వేర్వేరు బిల్లులు ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు.

తెలంగాణ జాగృతి, యూపీఎఫ్ మున్ముందు ఐక ఉద్యమాలను నిర్వహిస్తాయన్నారు. కేం ద్రంలోని ఎన్డీఏ ప్రభు త్వం, రాష్ట్రంలో ని కాంగ్రెస్ ప్రభుత్వం కూడబలు క్కొ ని బీసీ బిల్లులను కోల్డ్ స్టోరేజీలో పెట్టే కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు.