30-05-2025 02:09:30 AM
బీర్ల అయిలయ్య
హైదరాబాద్, మే 29 (విజయక్రాంతి): బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఉన్న ముసుగు తొలిగిపోయిందని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య తెలిపారు. కేటీఆర్కు దమ్ముంటే కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పాలని గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశా రు. కుటుంబాన్ని చక్కపెట్టుకోలేని వారు.. సీఎం రేవంత్రెడ్డిని విమర్శిస్తారా? అని ప్రశ్నించారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 8 ఎంపీ సీట్లు రావడానికి కారణం బీఆర్ఎస్ పార్టే కారణమని చెప్పారు.
బీఆర్ఎస్ను బీజేపీలో కేసీఆర్ ఎందుకు విలీనం చేయాలనుకున్నాడో కవిత బయటపెట్టాలన్నారు. పార్టీ నుంచి కవితను బయటకు పంపించడానికి కేటీఆర్ కుట్ర చేస్తున్నాడని తెలిపారు. సొంత చెల్లిని చూసి ఓర్వలేని కేటీఆర్.. తెలంగాణ ఆడబిడ్డలను ఎలా గౌరవిస్తారని ప్రశ్నించారు.