calender_icon.png 1 June, 2025 | 8:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్ద ప్యాకేజీ వస్తే బీజేపీ నేతలు బీఆర్‌ఎస్‌తో కలిసిపోతారు

30-05-2025 02:07:25 AM

  1. కవిత వ్యాఖ్యల్లో వాస్తవం ఉంది 
  2. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్, మే 29 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడిన అంశా లు వాస్తవమేనని బీజేపీ ఎమ్మెల్యే రాజాసిం గ్ పేర్కొన్నారు. ‘బీజేపీలోని కొంత మంది నేతలకు పెద్ద ప్యాకేజీ వస్తే బీఆర్‌ఎస్‌తో కలిపి పోతారు. బీజేపీ అభ్యర్థులు ఎక్కడి నుంచి పోటీ చేయాలో వాళ్లే డిసైడ్ చేస్తారు. గతంలోనూ ఇదే జరిగింది. అందుకే బీజేపీ తెలంగాణలో నష్టపోయింది’ అని రాజా సింగ్ గురువారం ఒక ప్రకటనలో ఆరోపిం చారు. 

ప్రతి ఎన్నిక ల్లోనూ తమ నేత లు బీఆర్‌ఎస్‌తో కుమ్మక్కయ్యారని, ఇతర పార్టీల తో తమ నేతలు కుమ్మ క్కు కావడంతోనే బీజేపీ తెలంగాణ లో  నష్టపోయింద ని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలో కి ఎందుకు రాలేదో ఆలోచించాలని, వాస్తవానికి బీజేపీ తెలంగాణలో ఎప్పుడో అధికారంలోకి రావాల్సింది ఉందన్నారు. ఇతర పార్టీల నేతలతో తమ నేతల కుమ్మక్కు అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు.