30-05-2025 02:11:27 AM
కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పాలి: విప్ ఆది శ్రీనివాస్
హైదరాబాద్, మే 29 (విజయక్రాంతి): ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలతో కేసీఆర్ అసలు రంగు బయటపడిందని, బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పంద ముసుగు తొలిగిపోయిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఏకమై కాంగ్రెస్ను దొంగదెబ్బ తీయడానికి మొదటి నుంచి ప్రయ త్నాలు చేస్తున్నాయని గురువారం ఒక ప్రకటనలో ఆరోపించారు. సీఎం రేవంత్రెడ్డి ఈ విషయాలను ఎప్పటి నుంచో చెబుతున్నారని గుర్తుచేశారు.
కవిత వ్యాఖ్యలపై కేసీఆర్, కేటీఆర్ ఎందుకు స్పందించడం లే ద న్నారు. బీజేపీతో బీఆర్ఎస్ ఒప్పందంపై ఆ పార్టీ కార్య కర్తలకు సమాధా నం చెప్పాలని డి మాండ్ చేశారు. రెండు పార్టీలు లోపాయికారి ఒప్పందం చేసుకున్నప్పటికీ ప్రజలు కాంగ్రెస్కు స్పష్టమైన తీర్పు ఇచ్చారని చెప్పారు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చుకున్నప్పుడే తెలంగాణ ప్రజలతో ఆ పార్టీకి పేగుబందం తెగిపోయిందని తెలిపారు.