7 July, 2026 | 6:42 PM

Breaking News

గ్రామాల్లో ఘనంగా సీత్ల పండుగ సంబరాలు   •   పోడు రైతులకు న్యాయం చేయాలి: ఎమ్మెల్యే కోవ లక్ష్మి   •   ఆరేపల్లి రాహుల్ ను సన్మానించిన అడ్వకేట్స్   •   సీడబ్ల్యూఎస్‌ఎన్ పిల్లలందరూ భవిత కేంద్రంను సద్వినియోగం చేసుకోవాలి   •   సీసీ రోడ్ల పనులు ప్రారంభం   •   జూలై 10న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయండి   •   విద్యార్థుల భవిష్యత్ తో చెలగాటమాడుతున్న ప్రైవేట్ పాఠశాలలు   •   "సర్" ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలి   •   బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నాయకత్వానికి ఏడాది.. రామాలయంలో ప్రత్యేక పూజలు   •   ఆదివాసి నాయకపోడ్ కులస్తులకు దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు   •  

ఆదివాసి నాయకపోడ్ కులస్తులకు దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు

07-07-2026 06:05 PM

నిజామాబాద్: జిల్లాలోని మోపాల్ మండలం, మంచిప్ప గ్రామానికి చెందిన నిరుపేద ఆదివాసి నాయకపోడ్ కుటుంబానికి చెందిన 8 సంవత్సరాల బాలుడు గుప్పల అశ్విన్ ప్రమాదవశాత్తు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న విషయం తెలిసిన వెంటనే స్పందించిన మన ఆదివాసి నాయకపోడ్ కులస్తులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నేను సైతం – నా నాయకపోడ్ చేయూతకై వాట్సాప్ గ్రూప్ ద్వారా చేసిన విజ్ఞప్తికి స్పందించిన దాతలు తమకు తోచిన విధంగా విరాళాలు అందించి మొత్తం రూ.43,950 సమకూర్చారు.

ఈ ఆర్థిక సహాయాన్ని ఆదివాసి నాయకపోడ్ సేవా సంఘం జిల్లా అధ్యక్షులు గాండ్ల రాంచందర్ ఆధ్వర్యంలో మంచిప్ప గ్రామ పెద్దల సమక్షంలో అశ్విన్ తల్లి *లత* గారికి అందజేయడం జరిగింది. ఈ సేవా కార్యక్రమానికి సహకరించిన ప్రతి దాతకు, కుల పెద్దలకు, గ్రామ పెద్దలకు, నేను సైతం – నా నాయకపోడ్ చేయూతకై వాట్సాప్ గ్రూప్ సభ్యులందరికీ, అలాగే ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు.

ఆపదలో ఉన్న మన కుటుంబాలకు ఇలాగే అందరం అండగా నిలిచి, మన ఐక్యతను మరింత బలోపేతం చేద్దాం.

జై భీమన్న!

జై ఆదివాసి నాయకపోడ్!!

ఆదివాసి నాయకపోడ్ కులస్తుల ఐక్యత వర్ధిల్లాలి!!!