05-06-2025 12:19:04 AM
మున్సిపల్ కమిషనర్ ..బి.శ్రీనివాస్
సూర్యాపేట, జూన్ 4 (విజయక్రాంతి) : 100 రోజుల ప్రణాళికలో భాగంగా 3 వ రోజు సూర్యాపేట పట్టణంలోని 3 వ వార్డు బిబి గూడెం నందు తడి చెత్త పొడి చెత్త వేరు చేయు కార్యక్రమంపై అవగాహన నిర్వహించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ బి.శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యాన్ని పరిరక్షించు కోవాలి అని అన్నారు.
అదే విధంగా గృహ,వాణిజ్య , వ్యాపార సంస్థల వారు తమ ఇండ్ల లోని చెత్తను తడి ,పొడి, హానికర మయిన చెత్తను వేరుచేసి ఇవ్వాలి అన్నారు,వీధులలో సంచరించు కుక్కల పట్ల జాగ్రత్తగా ఉండాలి అని పెంపుడు కుక్కల మెడకు బెల్ట్ లు, టీకాలు వేయించాలి అన్నారు,
ఈ కార్యక్రమంలో మున్సిపల్ డీ.ఇ సత్యారావు, సానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్,ఏ ఇ తిరుమలయ్య , యాదగిరి ,టీఎంసీ శ్వేత,వార్డ్ అధికారి ఎడ్ల వినోద్ ,ఎన్విరాన్ మెంట్ ఇంజనీర్ శివ ప్రసాద్, వసీం తదితరులు పాల్గొన్నారు..