12-12-2025 05:39:09 PM
గురుస్వామి సుంక శ్రీధర్
సుల్తానాబాద్,(విజయక్రాంతి): అయ్యప్ప మాలధారులు తమ దీక్షా కాలంలో, ఇరుముడి కట్టుకునే సమయంలో అయ్యప్ప స్వాములకు భక్తులు భక్తితో ఇచ్చే దక్షిణ రూపంలో ఇచ్చిన నగదును కేరళలోని శబరిమల ఆలయంలోనీ హుండీలో వేయడం వలన అక్కడి దేవాలయాలు అభివృద్ధి చెందుతున్నాయి. అది కాకుండా ఇటీవల మన తెలుగు రాష్ట్రాల భక్తులపై కేరళ వ్యాపారులు, కేరళ పోలీసులు దాడులు చేస్తున్నారు.
కాబట్టి ఇక మీదట ఆ దక్షిణ డబ్బులు మన ఊరిలో ఉన్న దేవాలయాలకు, గోశాలకు,అనాథ ఆశ్రమం కు గాని వినియోగిస్తే మన ఊరు,మన గుడి అభివృద్ధి చెందుతాయని ఈ విషయాన్ని గురుస్వాములు తమ తోటి స్వాములకు వివరంగా చెప్పి మోటివేట్ చేయాలని సుంక శ్రీధర్ గురుస్వామి తమ తోటి స్వాములను కోరారు.