calender_icon.png 5 June, 2025 | 4:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

16 వార్డులతో కేసముద్రం బల్దియా

03-06-2025 08:49:12 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో నూతనంగా ఏర్పడ్డ కేసముద్రం మున్సిపాలిటీలో 16 వార్డులను ఏర్పాటు చేస్తూ ముసాయిదా ప్రకటనను రాష్ట్ర మున్సిపల్ కమిషనర్, డైరెక్టర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (సిడిఎంఏ) ఉత్తర్వులు జారీ చేసినట్లు మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి(Municipal Commissioner Prasanna Rani) తెలిపారు. కేసముద్రం స్టేషన్, కేసముద్రం (వి), ఎస్‌.టి. కాలనీ తండా, ధనసరి, అమీనాపురం గ్రామాలను విలీనం చేసి కేసముద్రం మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కేసముద్రం బాల్దియాలో మున్సిపాలిటీని 16 వార్డులుగా వార్డు విభజన చేసి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసినట్లు చెప్పారు. వార్డు విభజనలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే వారం రోజుల్లో రాతపూర్వకంగా మున్సిపాలిటీలో అందజేయాలని కమిషనర్ ప్రజలను కోరారు.