calender_icon.png 5 June, 2025 | 5:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బక్రీద్ పండుగను ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలి

03-06-2025 08:46:29 PM

డీఎస్పీ ప్రసన్న కుమార్..

సూర్యాపేట (విజయక్రాంతి): బక్రీద్ పండుగను సోదర భావంతో కులమతాలకు అతీతంగా జరుపుకోవాలని డీఎస్పీ ప్రసన్న కుమార్(DSP Prasanna Kumar) అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కిరాణం మర్చంట్ ఫంక్షన్ హాల్లో శాంతి కమిటీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సూర్యాపేట ప్రజలు కుల, మతాలకతీతంగా సుహృద్భావ వాతావరణంలో పండుగలు జరుపుకొనే సంప్రదాయం ఎంతో సంతోషంగా ఉన్నదన్నారు.

ఈనెల 7వ తేదీన బక్రీదు పండగ అని దానిని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలన్నారు. సాంప్రదాయాల నుండే చట్టాలు వచ్చాయని తెలిపారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకొని కుల మతాల మధ్యలో విభేదాలు సృష్టించే వీడియోలు, ఫొటోస్ పెడితే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా చట్టాన్ని చేతులకు తీసుకోవడం నేరమన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ రాజశేఖర్, మున్సిపల్ కమిషనర్ బి.శ్రీనివాస్, తాసిల్దార్ కృష్ణయ్య, వెహికల్ ఇన్స్పెక్టర్ జయప్రకాశ్ రెడ్డి, ఎస్సైలు ఏడుకొండలు, సైదులు, ఆంజనేయులు, ప్రవీణ్, ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం, హిందూ, ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.