03-06-2025 08:52:13 PM
సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి..
కొండపాక: సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విద్యాశాఖ, ఈడబ్ల్యూఐడిసి, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించి, ప్రభుత్వ పాఠశాలల్లో మైనర్ రిపేర్లు, అదనపు తరగతి గదుల నిర్మాణం కొరకు ప్రతిపాదనలు పంపించాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి(District Collector Manu Chowdhury) అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎం మను చౌదరి మాట్లాడుతూ... జిల్లాలో మున్సిపాలిటీ, మండలాల వారిగా అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన నిర్మాణ పనులను, పెండింగ్ బిల్లులపై సమీక్షించారు.
అమ్మ ఆదర్శ పాఠశాలల పథకం ద్వారా చేపట్టిన నిర్మాణ పనులు దాదాపు పూర్తయి బిల్లులను కూడా చెల్లించామని అన్నారు. పెండింగ్ బిల్లుల వివరాలను త్వరగా ఎంబి రికార్డు చేసి అందించాలని, అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంకా కొత్తగా గుర్తించిన రిపేర్లు అదనపు తరగతి గదుల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ శ్రీనివాసరెడ్డి, విద్యాశాఖ సెక్టోరల్ అధికారి రామస్వామి, ఈ డబ్ల్యూఐడిసి ఇఇ శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీరాజ్ ఇఇ లు, ఈ డబ్ల్యూ ఐడిసి ఏఇ లు తదితరులు పాల్గొన్నారు.