20-12-2025 12:00:00 AM
కేసముద్రం, డిసెంబర్ 19 (విజయక్రాంతి): జార్ఖండ్ లో నిర్వహించే జాతీయ స్థాయి మినీ యూత్ టోర్నమెంట్ టెన్నిస్ వాలీబాల్ పోటీలకు మహబూబాబాద్ జి ల్లా కేసముద్రం గిరిజన సంక్షేమ బాలికల గు రుకుల కళాశాల విద్యార్థినిలు ఏడుగురు ఎం పికైనట్లు ప్రిన్సిపల్ హర్షిత, పిఈటి విజయనిర్మల తెలిపారు. ఈనెల 17, 18 తేదీల్లో హై దరాబాద్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీలో కళాశాలకు చెందిన జి.నందిని, బి. మేఘన, బి.రోహిణి, ఏ.హిందూ, బి.హిం దూ, ఎస్.ఝాన్సీ అత్యంత ప్రతిభ చాటి జా తీయ స్థాయి పోటీలకు ఎన్నికైనట్లు చెప్పా రు. జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థినులను అభినందించారు.