స్పృహ తప్పి పడిపోయిన ఖమ్మం త్రీ టౌన్ సీఐ రమేష్
21-10-2024 01:41 PM
ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో సోమవారం పోలీస్ అమరవీరుల దినోత్సవ వేడుకలు సందర్భంగా ఏర్పాట్లు పరిశీలిస్తున్న నేపద్యంలో ఖమ్మం త్రీ టౌన్ సీఐ రమేష్ స్పృహ తప్పి పడిపోయారు. సీపీ అప్రమత్తమై వెంటనే సీఐ ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది.






