calender_icon.png 27 June, 2025 | 3:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్ధులకు ఖమ్మం యూత్ అసోసియేషన్ చేయూత

26-06-2025 11:11:24 PM

ఇల్లందు (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలో విద్యార్ధులకు అండగా ఖమ్మం యూత్ అసోసియేషన్ నిలిచారు. పట్టణంలోని స్థానిక జెబిఎస్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్ధులకు స్కూల్ బ్యాగ్స్, వాటర్ బాటిల్స్, నోట్ బుక్స్, పెన్సిల్స్ కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంఈఓ ఉమాశంకర్(MEO Umashankar) పాల్గొని మాట్లాడారు. నిరుపేద విద్యార్థులకు అండగా నిలుస్తున్న ఖమ్మం యూత్ అసోసియేషన్ ను అభినందించారు. అనంతర అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ... ప్రైమరీ ఎడ్యుకేషన్ అభివృద్ధి కొరకు పాఠశాలల్లో విద్యార్థుల క్రమశిక్షణ అటెండెన్స్ పెంచేందుకు తమ సంస్థ ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో జేబీఎస్ హైస్కూల్ హెడ్మాస్టర్ లలిత, స్కూల్ అసిస్టెంట్ నాగుల మీరా, ఏఏపిసి చైర్మన్ కవిత, టీచర్లు సౌందర్య, ఫణి భాస్కర్, అసోసియేషన్ సభ్యులు శ్రీ తేజ, శ్రీకాంత్, అర్జున్ సింగ్, రాహుల్, నవీన్, రాము తదితరులు పాల్గొన్నారు.