calender_icon.png 27 June, 2025 | 2:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాదకద్రవ్యాలు, డ్రగ్స్ కు విద్యార్థులు దూరంగా ఉండాలి

26-06-2025 11:06:06 PM

చండూరు (విజయక్రాంతి): మాదకద్రవ్యాలు, డ్రగ్స్ కు విద్యార్థులు దూరంగా ఉండాలని, విద్యే లక్ష్యంగా విద్యార్థులు ముందుకు సాగాలని చండూర్ ఎక్సైజ్ ఎస్సై కుర్మా నాయక్(Excise Sub-Inspector Kurma Nayak), డాన్ బోస్కో ప్రిన్సిపల్ డాక్టర్ విల్సన్ లు అన్నారు. గురువారం స్థానిక డాన్ బోస్కో కళాశాలలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... నేటి సమాజంలో మాదకద్రవ్యాలు, డ్రగ్స్ కు అలవాటు పడిన యువత బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారన్నారు.

ముందు జాగ్రత్తగా విద్యార్థులు వాటికి దూరంగా ఉండి, తల్లిదండ్రులకు, పుట్టిన ఊరుకు, పాఠశాలకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. మాదకద్రవ్య రహిత సమాజం కోసం యువత పాటుపడాలన్నారు. మాదకద్రవ్యాలకు, డ్రగ్స్ కు వ్యతిరేకంగా విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. యువత డ్రగ్స్ భారిన పడి ఉజ్వాల బహుశత్తును నాశనం చేసుకోవద్దు అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.