10 May, 2026 | 6:59 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

గనుల శాఖలో నూతన పాలసీ తీసుకొచ్చాం: కిషన్ రెడ్డి

27-02-2025 01:41 PM

న్యూఢిల్లీ: గనులశాఖలో నూతన పాలసీ తీసుకొచ్చి, 12 ఖనిజాల రాయల్టీని పెంచామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గనులశాఖ చాలా మార్పులు వచ్చాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఏడాది 448 ప్రాజెక్టుల్లో గనుల అన్వేషణను జీఎస్ఐ చేపట్టిందని ఆయన వెల్లడించారు. గనుల అన్వేషణలో ప్రైవేటు రంగాన్ని కూడా భాగస్వామ్యం చేస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది 12 ప్రైవేటు సంస్థలు గనుల అన్వేషణలో భాగస్వామ్యం అయ్యాయని వివరించారు. ప్రధాని మోదీ నాయకత్వం(Prime Minister Narendra Modi)లో మైనింగ్ లో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని తెలిపారు. ఆఫ్ షోర్ ఖనిజాల ఉత్పత్తిని పెంచుతున్నామని పేర్కొన్నారు.