08-02-2026 01:42:35 AM
హైదరాబాద్, సిటీ బ్యూరో ఫిబ్రవరి 07 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు(కేకే) కుమారుడు కె.వెంకటేశ్వరరావుకు బెదిరింపులు ఎదురయ్యాయి. నివాస స్థలాల విష యంలో తనను బెదిరిస్తూ, భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారంటూ ఆయన బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు.
ఈ మేరకు సిద్దిపేట జిల్లా కొండపాకకు చెందిన గడీల రఘువీర్రెడ్డితో పాటు అన్వేష్రెడ్డిపై ఆయన ఫిర్యాదు చేశారు. వెంకటేశ్వరరావు ఫిర్యాదు ప్రకారం.. కొంతకాలంగా నివాస స్థలాల విషయంలో నిందితులతో వివాదం నడుస్తోంది. ఫిర్యాదును స్వీకరించిన బంజారాహిల్స్ పోలీసులు.. రఘువీర్రెడ్డి, అన్వేష్ రెడ్డిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసును దర్యాప్తు చేస్తున్నారు.