24 August, 2026 | 10:28 PM

Breaking News

భద్రాచలం రోటరీ క్లబ్‌కు ప్రత్యేక గుర్తింపు   •   8 దేశాల తైక్వాండో పోటీలో భారత్‌కు బంగారు పతకం   •   మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •   ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు అన్వర్ స్కాలర్‌షిప్   •   ఒంటరి మహిళల సర్టిఫికెట్లకు తిప్పలు!   •   సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   గణేష్ మాండపాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని వినతి   •   చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్   •   యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి   •  

నకిలీ కాఫీ, సిగిరెట్ పాకెట్లు పట్టుకున్న కోదాడ పోలీసులు

30-04-2026 12:29 AM

కోదాడ ఏప్రిల్ 29: కోదాడ కేంద్రంగా సాగుతున్న నకిలీ కాఫీ, సిగరెట్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. బుధవారం పట్టణ సీఐ శివశంకర్ వెల్లడించిన వివరాల ప్రకారం హైదరాబాద్ నుంచి నకిలీ ‘బ్రూ’ కాఫీ ప్యాకెట్లు, సిగరెట్లు  ఇతర సరుకులు తెచ్చి కోదాడతో పాటు పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా విక్రయిస్తున్న ముఠాపై  విశ్వసనీయత సమాచారం మేరకు దాడులు నిర్వహించి వెంకటేశ్వర నగర్ లో పట్టుకున్నట్లు తెలిపారు.

ఈ దాడుల్లో సుమారు రూ.3 లక్షల విలువైన నకిలీ ‘బ్రూ’ కాఫీ ప్యాకెట్లు, సిగరెట్ ప్యాకెట్లు, ఇతర సరుకులను సీజ్ చేశారు. ఈ వ్యవహారంలో పావులూరి నారాయణమూర్తి, అనుప్ అగర్వాల్, సతీష్ ఏడిద అనే ముగ్గురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. వారి వద్ద నుండి నాలుగు మొబైల్ ఫోన్లో కూడా తీసుకుని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ప్రముఖ బ్రాండ్ల పేరుతో నకిలీ ప్యాకేజింగ్ చేసి, అమాయక వినియోగదారులను మోసం చేస్తూ భారీగా అక్రమ లాభాలు ఆర్జిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నాణ్యతలేని పదార్థాలతో తయారైన ఈ ఉత్పత్తులు ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా మారే అవకాశముందని హెచ్చరించారు.