14-10-2024 12:04:35 AM
సిద్దు జొన్నలగడ్డ, ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ కలయికలో సినిమా రానుంది. ఇప్పటికే ఈ కాంబోలో ‘డీజే టిల్లు, టిల్లు స్కేర్’ చిత్రాలు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు వీరి కలయికలో మూడో సినిమా రానుంది. విజయదశమి సందర్భంగా ఇంతవరకూ ఎవరూ చేయని కథాంశంతో సినిమా చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు.
‘కోహినూర్ వజ్రాన్ని తిరిగి తీసుకురావడం’ అనే కథాంశంతో చిత్రాన్ని రూపొందించనున్నట్టు నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి రవికాంత్ పేరెపు దర్శకత్వం వహించనున్నారు. రవికాంత్, సిద్దు కాంబోలో ‘కృష్ణ అండ్ హిజ్ లీల అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ రూపొందింది. ప్రస్తుత చిత్రాన్ని జనవరి 2026లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఈ సినిమాని భారీ బడ్జెట్తో ప్రపంచ స్థాయి సాంకేతిక విలువలతో రూపొందించనున్నట్టు మేకర్స్ తెలిపారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర వంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.