calender_icon.png 21 June, 2025 | 4:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విలువలతో కూడిన విద్యను అందించాలి ఎమ్మెల్యే కూనంనేని

20-06-2025 12:00:00 AM

కొత్తగూడెం, జూన్ 19, (విజయ క్రాంతి ) ప్రభుత్వ, ప్రైవేటు విద్య సంస్థలు విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాలని,కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. పట్టణంలోని న్యూ గొల్లగూడెం కిడ్స్ పార్క్ పాఠశాలలో గురువారం ఎనిమిదో తరగతిని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా మా ట్లాడుతూ ప్రైవేటు విద్య సంస్థలు వ్యాపార దృక్పధంతో కాకుండా, సామాజిక సేవా దృక్పధంతో తమ విద్యా సంస్థలను కొనసాగించాలన్నారు. పట్టణంలోని కిడ్స్ పార్క్ పాఠశాల మెరుగైన విద్యను అందించి విద్యార్థుల భావిజీవితానికి బాటలు వేయాలని, ఏజెన్సీ గ్రామాలకు కేంద్రంగా ఉన్న కొత్తగూడెం పట్టణంలో కిడ్స్ పార్క్ పాఠశాల స్థాపించి పేద విద్యార్థులకు విద్యను అందించడం అభినందనీయమన్నారు.

కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, నాయకులు మాచర్ల శ్రీనివాస్, బోయిన విజయ్ కుమార్, యూసుఫ్, ధర్మరాజు, సత్యనారాయణ చారి, దుర్గ, నేరెళ్ల రమేష్, ముత్యాల అజయ్ పాల్గొన్నారు.