calender_icon.png 21 June, 2025 | 12:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శేరిలింగంపల్లి నియోజకవర్గ సమగ్ర అభివృద్దే ధ్యేయం

20-06-2025 12:00:00 AM

పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ 

కూకట్ పల్లి జూన్ 19(విజయక్రాంతి): సంక్షేమం అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే పిఎసి చైర్మన్ అరెకపూడి గాంధీ తెలిపారు. ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ, శంషిగుడా, హెచ్‌ఎంటి శాతవాహన నగర్ కాలనీలలో రూ. 3 కోట్ల 30 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం, క్రిస్టియన్ స్మశాన వాటిక, పార్క్ అభివృద్ధి నిర్మాణము పనులకు కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు తో కలిసి ముఖ్యఅతిథిగా పిఎసి చైర్మన్ ఆరెకపూడి గాంధీ పాల్గొని శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా పిఏసి చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం శేరిలింగంపల్లి నియోజకవర్గం కాలనీ ల అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు తెలిపా రు. మౌళిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తానని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకం లో శేరిలింగంపల్లి నియోకజకర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన ,అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదితానని తెలియచేసారు. సీసీ రోడ్లు వంటి అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని ,నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని అధి కారుులకు సూచించారు.

పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని గాంధీ పునరుద్ఘాటించారు. ప్రతి కాలనీ లో పార్క్ లను అభివృద్ధి చేసి ప్రజలకు స్వచ్ఛమైన ఆహ్లదకరమైన వాతావరణం కల్పిస్తామని అన్నారు. ప్రజలు ఉదయం, సాయంత్రం పూట వాకింగ్ చేసుకోవడానికి, ఓపెన్ జిమ్ చేసుకోవడానికి, పిల్లలు వృద్ధులు కాలక్షేపానికి పార్కులు ఎంతగానో దోహదపడుతాయి అని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు, కాలనీల అసోసియేషన్ సభ్యులు,మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.